పిడుగుపాటుకు ముగ్గురు మృతి..

by  |
పిడుగుపాటుకు ముగ్గురు మృతి..
X

దిశ, మక్తల్ : కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడేబల్లూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపడి శ్రీనివాసు (14), కుర్వ తిమ్మప్ప (40) చనిపోయారు. బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పొలం దగ్గరకు వెళ్తుండగా శ్రీనివాస్, గొర్రెల మంద కాపలాగా ఉండగా తిమ్మప్పలపై పిడుగు పడటంతో వారు చనిపోయారు.

లాగే.. నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామ శివారులో అప్పకపల్లి గ్రామానికి చెందిన మహేష్(22) బుధవారం సాయంత్రం పొలంలో ఉన్న పశువులను ఇంటికి తీసుకు వస్తుండగా.. మహేష్ సమీపంలోనే పిడుగు పడింది. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.


Next Story