కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి

by  |
కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బంతారా ఏరియాలో జరిగింది. వివరాళ్లోకి వెళితే… సుందర్ లాల్(35), అచ్చె(30), రాజ్ కుమార్(32), వీరితో పాటు మరో ఇద్దరు మొత్తం ఐదుగురు కలిసి, గురువారం రాత్రి బంతారా ఏరియాలో మద్యం సేవించారు. ఈ క్రమంలో రాత్రి నిద్రలో ఉండగా సుందర్ లాల్, అచ్చె, రాజ్ కుమార్‌లు ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ.. ముగ్గురూ మృతిచెందారు. అంతేగాకుండా వారితో మద్యం సేవించిన మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. కల్తీ మద్యం మూలంగా చనిపోయారా? లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న మద్యం దుకాణం యజమానుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



Next Story