చిన్నారులను మింగేసిన నీటికుంట..

by  |
చిన్నారులను మింగేసిన నీటికుంట..
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని గంట్యాడ మండలం నరవలో బుధవారం చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తు నీటి కుంటలో పడిపోయారు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి నీటి కుంటలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.



Next Story

Most Viewed