జొన్నరొట్టెలు తిని ముగ్గురు మృతి

by  |
జొన్నరొట్టెలు తిని ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జొన్నరొట్టెలు తిని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వట్‌పల్లి మండలం పల్‌పట్లలో సోమవారం రాత్రి జొన్న రొట్టెలు చేసుకుని తిన్నారు కుటుంబసభ్యులు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చంద్రమౌళి, సుశీల, శ్రీశైలంగా గుర్తించారు. గత వారం ఇదే పిండితో చేసిన రొట్టెలు తిని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రొట్టెల పిండిని ల్యాబ్‌కు తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed