RSP ఎఫెక్ట్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషోర్‌కు బెదిరింపు కాల్

by  |
TRS MLA Kishor kumar
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేసే హక్కు ప్రవీణ్ కుమార్‌కు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంపత్ అనే స్వేరో నాయకుడు ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు. ‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కామెంట్ చేసేంత మొనగాడివా’ అంటూ బెదిరింపులకు పాల్పడినట్టు గాదరి కిషోర్ వెల్లడించారు. మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.


Next Story