18+ వారికి వ్యాక్సిన్.. శనివారం నుంచే రిజిస్ట్రేషన్

by  |
18+ వారికి వ్యాక్సిన్.. శనివారం నుంచే రిజిస్ట్రేషన్
X

న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు నిండినవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని సంకల్పించిన కేంద్రప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేవారు ఈనెల 24 నుంచి (శనివారం) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపింది. ‘కొవిన్ పోర్టల్‌’లో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శ‌ర్మ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమర్పించాల్సిన సంబంధిత పేపర్లు గతంలో మాదిరిగానే ఉన్నాయని, వాటిలో ఏ మార్పూ లేదని ఆయన సూచించారు. ఏప్రిల్ 24 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా కొవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు.


Next Story