కరోనా మాత్రలంటూ.. మత్తు టాబ్లెట్స్ ఇచ్చి ఆపై..

by  |
కరోనా మాత్రలంటూ.. మత్తు టాబ్లెట్స్ ఇచ్చి ఆపై..
X

దిశ, సూర్యాపేట : కరోనా కష్టకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వృద్ధ మహిళలనే టార్గెట్ చేస్తూ బంగారు ఆభరణాల అపహరణ చేస్తున్నారు. కరోనా టాబ్లెట్స్ అంటూ మహిళలకు మత్తు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి జారిన వెంటనే ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా కుడ కుడ గ్రామంలో దుండగులు కరోనా నిర్మూలించే మాత్రలు.. ప్రభుత్వం వారు పంపించారని ఇంటింటికి తిరిగి ఇస్తున్నామని చెబుతూ మత్తు టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రెడ్డబోయిన ఎల్లమ్మ (75)వృద్ధ మహిళ కు మత్తు టాబ్లెట్ లు ఇచ్చి ఒంటి పై ఉన్న మూడు తులంన్నర బంగారు పుస్తెలతాడును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చివ్వేంముల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed