మ‌ణికొండ‌లో దొంగ‌ల బీభ‌త్సం.. 50 తులాల బంగారం చోరి

by  |
మ‌ణికొండ‌లో దొంగ‌ల బీభ‌త్సం.. 50 తులాల బంగారం చోరి
X

దిశ‌, గండిపేట్ : నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు అపార్ట్ మెంట్‌లలో మూడు ఇళ్ల‌ను దోచేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నార్సింగి పోలీస్టేషన్ పరిధిలోని మణికొండ‌లో గుర్తుతెలియని దుండగులు రెండు అపార్ట్ మెంట్ లలో రెండు ఇళ్ల‌లో తాళాలు బ్రేక్ చేసి 50 తులాల బంగారం, రెండు లక్షల వరకు దొచేశారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉడడంతో దొంగతనం విషయం బయటపడింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎఓటి టీమ్, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ బృందాలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ మేర‌కు కేసు ద‌ర్యాప్తులో ఉంది.



Next Story

Most Viewed