ఛీ.. దేవాలయంలోనే ఆ పని చేసిన దుర్మార్గులు

by  |
Theft
X

దిశ, నేరేడుచర్ల: దేవాలయం తలుపులు పగులగొట్టి హుండీలోని నగదును ఎత్తుకెళ్లిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఆలయ కమిటీ చైర్మన్ సిలివేరు నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలంలోని బక్కమంతులగుండె గ్రామం శివారులో ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శనివారం రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి అనంతరం హుండీ తాళం పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. ఈ ఆలయంలో గతంలో కూడా ఇదేవిధంగా మూడు సార్లు తలుపులు, హుండీ పగులగొట్టి అందులోని నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారని నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని మఠంపల్లి ఎస్సై రవి తెలిపారు.


Next Story

Most Viewed