సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో దోపిడీ.. చేసిందెవరు..?

by  |
సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో దోపిడీ.. చేసిందెవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత గణేష్ టెంపుల్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు గుడిలోకి చొరబడ్డ దొంగలు హుండీ తాళం పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. గర్భగుడిలోని అభరణాలను మాత్రం ముట్టుకోలేదని.. ఈ దొంగతనం స్థానికంగా ఉంటున్న వారు చేసిన పనేనని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని వారు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed