శాసన సభలో నేడు చర్చించే అంశాలు ఇవే..

by  |
Telangana Assembly
X

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. గత గురువారం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. అంశాల వారిగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం విద్యా, వైద్య ఆరోగ్య శాఖలు, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య సహా వివిధ శాఖల పద్దులపై శాసనసభలో చర్చించనున్నారు. వీటితోపాటు క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీశాఖ, పర్యాటక, ప్రభుత్వరంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దులపై చర్చించనున్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ, బస్తీ దవాఖాలు, గిరిజన ఉప ప్రణాళిక, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణం, పామాయిల్ సాగుపై చర్చించనున్నారు.



Next Story