- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించనున్నారన్న వార్తలను ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఢిల్లీలో త్వరలో కొత్త ఆంక్షలను అమలు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పది రోజులకు సరిపడా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు కేంద్రం పంపితే వ్యాక్సిన్పై వయోపరిమితిని ఎత్తివేస్తామని, వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను పెంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. కాగా ఢిల్లీలో ప్రస్తుతం కరోనా ఫోర్త్ వేవ్ నడుస్తోందన్నారు. అందువల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story