శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదు

by  |
Srisailam
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలం కుడిగట్టు కేంద్రం ద్వారా ఏపీ విద్యుత్ ఉత్పత్తికి అభ్యంతరం లేదని కృష్ణ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు తెలంగాణను అభిప్రాయం కోరింది. ఈ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్‌, పులిచింతల కేంద్రాల ద్వారా గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి తెలంగాణకు అనుమతి ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, బోర్ల కోసం విద్యుత్ ఉత్పత్తి అవసరమని వివరించారు. కృష్ణా బేసిన్ అవసరాలు తీరకుండా బేసిన్ వెలుపలకు జలాలను తరలించకుండా ఏపీని నిలువరించాలని ఇప్పటికే బోర్డు దృష్టికి, కేంద్ర జలశక్తిశాఖను పదేపదే కోరామన్నారు. మండలి రెండో సమావేశంలోనూ సీఎం కేసీఆర్ ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. బేసిన్ అవసరాలు తీరకుండా కృష్ణాజలాలను ఇతర బేసిన్లకు ఆంధ్రప్రదేశ్ తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఏడాది నుంచి కృష్ణా జలాలను చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ మరోమారు లేఖలో కోరింది. అలాగే త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలు విడుదల చేయకుండా చూడాలని కోరింది.


Next Story

Most Viewed