- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వర్సిటీల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండొద్దని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ టీజేఎస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థి జన సమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుస్తున్నారని, అయితే కొవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే విద్యార్థులు వైరస్ బారిన పడే అవకాశముందన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలని రెసిడెన్షియళ్లుగా మార్చాలని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, ప్రవీణ్ ఆర్య, వినోద్ కుమార్, బాబు మహాజన్, అరుణ్ కుమార్, ప్రశాంత్, నరేందర్, వీరనాయక్, రాజేష్ నాయక్, శ్రీను, జీవన్, పవన్ పాల్గొన్నారు.