అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 43 రకాల వన్యప్రాణులు

by  |
Tiger
X

దిశ, తెలంగాణ బ్యూరో : అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంఖ్య పెరిగేందుకు అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ తెలిపారు. శుక్రవారం అటవీశాఖ కార్యాలయంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్) వన్యప్రాణులపై అటవీ శాఖ రూపొందించిన వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్‌లో 14 పులులను గుర్తించామని, ఇతర వన్యప్రాణుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. శాఖాహార జంతువుల లభ్యత కూడా బాగా పెరిగినట్లు నివేదిక సూచిస్తోందని తెలిపారు.

PCCF R. Shobha

అమ్రాబాద్ ఫీల్డ్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ పులుల సంక్షణ కేంద్రం(ఎన్టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం ఏటా అభయారణ్యంలో పులులు, వన్యప్రాణులను లెక్కిస్తామని అన్నారు. లైన్ ట్రాన్సిక్ట్ మెథడ్, వాటర్ హోల్ సెన్సస్ ల ఆధారంగా జంతువులను లెక్కించామని వెల్లడించారు. ప్రతీ చదరపు కిలో మీటరు విస్తీర్ణంలో జింకలు, చుక్కల దుప్పులు, అడవి పందులు, సాంబార్, లంగూర్ లాంటి జంతువులను లెక్కించామన్నారు. మొత్తం 43 రకాల వన్యప్రాణులు అమ్రాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయని, ఇందులో అరుదైన హానీ బాడ్జర్ లాంటి జంతువులు ఉన్నాయన్నారు.

కార్యక్రమంలో పీసీసీఎఫ్ (ఎస్.ఎఫ్) ఆర్.ఎం.దోబ్రియల్, పీసీసీఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, వైల్డ్ లైఫ్ అదనపు పీసీసీఎఫ్ సిద్దానంద్ కుక్రేటీ, అదనపు పీసీసీఎఫ్ లు ఎం.సీ. పర్గాయిన్, వినయ్ కుమార్, ఎస్.కే. సిన్హా, డీఎఫ్ఓ, ఎఫ్.డీ.ఓ, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed