తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

by  |
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి కొంతమేర తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,021 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,13,084 కు చేరింది. కొత్తగా వైరస్ బారిన పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 1,228కు పెరిగింది. తాజాగా 2,214 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,87,324 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో30,210 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 35,77,261 కు చేరింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.



Next Story

Most Viewed