ఒకేసారి రెండిళ్లలో దోపిడీ

by Chintha Aamani |   (  Updated:2020-08-29 05:18:41  IST  )

<p>దిశ, ముదోల్: నిజయోకవర్గంలో దొంగలు హల్‌చల్ చేశారు. రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఈఘటన భైంసా మండలం సిద్దూర్ గ్రామాంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆడెపు జనార్థన్, డోబ్కర్ నారాయణకు చెందిన ఇళ్లలో దొంగతనం జరిగింది. జనార్థన్ తల్లి ఇటీవల మృతి చెందటంతో బంధువుల ఇంటికి నిద్రకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో రూ. 15వేల నగదు, 2 తులాల బంగారం, 15 తులాల వెండిని అపహరించారు. మరో బాధితుడు [&hellip;]</p>

ఒకేసారి రెండిళ్లలో దోపిడీ
X

దిశ, ముదోల్: నిజయోకవర్గంలో దొంగలు హల్‌చల్ చేశారు. రెండు ఇళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఈఘటన భైంసా మండలం సిద్దూర్ గ్రామాంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆడెపు జనార్థన్, డోబ్కర్ నారాయణకు చెందిన ఇళ్లలో దొంగతనం జరిగింది. జనార్థన్ తల్లి ఇటీవల మృతి చెందటంతో బంధువుల ఇంటికి నిద్రకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో రూ. 15వేల నగదు, 2 తులాల బంగారం, 15 తులాల వెండిని అపహరించారు. మరో బాధితుడు డోబ్కర్ నారాయణ నిజామాబాద్‌కు బంధువుల ఇంటికి వెళ్లడంతో.. అతని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందరవందరగా పడేశారు. సమాచారం తెలుసుకున్నపోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుణ్ణం చందర్ తెలిపారు.

Next Story