- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబాబాద్: ఈ మధ్య సినిమాల ప్రభావం జనాలపై బాగా పడింది. సినిమాలోని హీరోలను, నటులను ఫాలో అవ్వడం, సినిమాలో వారు చేసినట్లు నిజ జీవితంలో చేయాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాల్లోని పాత్రలను చూసి బయట అనుసరించడం మొదలుపెడుతున్నారు. సినిమాల ప్రభావంతో సినీ ఫక్కీలో హత్యలు చేయడం, దొంగతనాలు చేయడం లాంటివి తరచూ జరుగుతున్నాయి.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా సినిమాలోని ఒక సీన్ను దొంగలు ఫాలో అయ్యారు. ఖలేజా సినిమాలో కొందరు ఎడారిలో ఉన్న వాహనాలను పార్ట్ పార్టులుగా విడగొట్టి మాయం చేస్తుంటారు. సేమ్ టూ సేమ్ అలాగే ఒక వాహనాన్ని దొంగతనం చేశారు అగంతకులు. మహబూబాబాద్ జిల్లాలోని అర్బన్ పార్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్బన్ పార్క్ నిర్మాణ దశలో ఉన్న సమయంలో ఒక టాటాఎస్ వాహనం కొనుగోలు చేశారు. పనులు పూర్తి అయిన తర్వాత వాహనాన్ని మూలకు పడవేశారు. ఈ వాహనంలోని అన్ని భాగాలను దొంగలు ఎత్తుకెళ్ళి ,కేవలం పైన ఫ్రెమ్ మాత్రమే ఉంచారు . దీన్ని చూసిన ప్రజలు భలే.. దొంగలు అని చమత్కరిస్తున్నారు.