చిల్లర కోసం హ్యాండ్ బ్యాగ్ చూసి షాకైన మహిళ.. ఎందుకంటే ?

by  |
చిల్లర కోసం హ్యాండ్ బ్యాగ్ చూసి షాకైన మహిళ.. ఎందుకంటే ?
X

దిశ, సదాశివపేట : మెదక్ జిల్లాలో చోరి జరిగింది. ప్రయాణికురాలి వద్దనుంచి లక్షరూపాయల నగదు మూడు తులాల బంగారం దొంగిలించిన ఘటన సదాశివపేట బస్టాండ్‌లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సదాశివపేట పట్టణంకు చెందిన విజయలక్ష్మీ తన భర్త ,కూతురు‌తో హైదరాబాద్ వెళ్లడానికి ఉదయం 11 గంటలకు బస్టాండ్‌కు వెళ్లారు. సంగారెడ్డి వెళ్లే బస్సు ఎక్కారు. నంది కంది చౌరస్త వద్దకు రాగానే టికెట్ కోసం 10 రూపాయల చిల్లర కోసం తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకుంది. అప్పటికే తన బ్యాగ్‌లో లక్షల రూపాయలు,3 తులాల బంగారం దొంగలించారని తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


Next Story