భలే దొంగలు.. మంత్రుల, ఎమ్మెల్యేల విల్లాలోనే దొంగతనం

by  |
భలే దొంగలు.. మంత్రుల, ఎమ్మెల్యేల విల్లాలోనే దొంగతనం
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడేపల్లి లోని రెయిన్ బో విల్లాల్లో దొంగలు హల్ చల్ చేశారు. విల్లా నెంబర్ 37,39,44 విల్లాల్లో దొంగతనం జరిగినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే ఎంత మేర సొత్తు దొంగతనానికి గురైందన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఈ విల్లాలన్నీ ప్రముఖులకు సంబంధించినవే కావడం గమనార్హం. పలువురు మంత్రులు, టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యేలకు చెందిన విల్లాలు ఇక్కడ ఉన్నాయి. సీఎం నివాసం సైతం ఇక్కడకు సమీపంలోనే ఉంది. పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలోనే VIPలు ఇక్కడకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం వారెవరూ ఇక్కడ లేరు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా దొంగలెవరు అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed