కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఇంట్లో చోరీ

by  |
కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఇంట్లో చోరీ
X

దిశ, వెబ్‎డెస్క్:

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు చోరీ అయినట్లు రేణుకా చౌదరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంట్లో పని చేసేవాళ్లే దొంగతనానికి పాల్పడ్డారా..? లేదా బయట వ్యక్తుల పనా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.



Next Story