భూ పంపకాల్లో ఘర్షణ.. అన్నను హతమార్చిన తమ్ముడు

by  |
murder veeresham
X

దిశ‌, న‌ర్సాపూర్: మెదక్ జిల్లా హత్నూర మండలం నవాబుపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ పంపకాల్లో అన్నాదమ్ముల మధ్య జరిగిన గొడవ ప్రాణాలమీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. నవాబు గ్రామానికి చెందిన జక్కుల వీరేశం(40), జక్కుల శ్రీశైలంలు సొంత అన్నాదమ్ములు. వీరి మధ్య గతకొన్ని రోజులుగా వ్యవసాయ భూమి పంపకాల్లో వివాదం జరుగుతోంది. శనివారం మళ్లీ జరిగిన వివాదం.. తీవ్రరూపం దాల్చింది. ఇరువురి మధ్య భారీ ఘర్షణ జరుగడంతో అన్న వీరేశంపై తమ్ముడు శ్రీశైలం కట్టెలతో దాడి చేశాడు. ఈ దాడిలో వీరేశంకు తీవ్ర గాయాలు అయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. గమనించిన స్థానికులు సంగారెడ్డి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరేశం మృతిచెందినట్లు తెలిపారు. వీరేశానికి భార్య స్వరూప, ఒక కూతురు, క‌మారుడు ఉన్నారు. భార్య స్వరూప ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ధ‌ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ల‌క్ష్మారెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed