యారాళ్ల మధ్య గొడవ.. తమ్ముడ్ని కొట్టిచంపిన అన్న

by  |
యారాళ్ల మధ్య గొడవ.. తమ్ముడ్ని కొట్టిచంపిన అన్న
X

దిశ, కోదాడ: మానవత్వం మంటగలిసి, రక్త సంబంధాలు కాస్త రక్త పాతాలకు దారి తీస్తున్నాయి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాలో ఇద్దరి మహిళల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్నీ బలిగొంది. కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి ప్రకారం.. చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాకు చెందిన వాoకుడోత్ బుజ్యా, సుగ్రీవ నాయక్‌లు ఇద్దరు అన్న తమ్ముళ్లు. ఇద్దరికీ పెళ్లిల్లు అయ్యాయి. ఈ క్రమంలో అన్నాదమ్ముల భార్యలిద్దరికీ బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య మాట మాట పెరగడంతో తమ్ముడు సుగ్రీవ అన్న భార్య మీదక దాడికి యత్నించాడు. ఇంతలో అన్న బుజ్యా రోకలి బండతో తమ్ముడు సుగ్రీవ తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. పొస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివరాంరెడ్డి తెలిపారు.


Next Story

Most Viewed