దేవుడు పిలుస్తున్నాడంటూ… చెల్లెకి మెసేజ్ పెట్టి.. ఓ యువతి ఏం చేసిందటే?

by  |
దేవుడు పిలుస్తున్నాడంటూ…  చెల్లెకి మెసేజ్ పెట్టి.. ఓ యువతి ఏం చేసిందటే?
X

దిశ, నర్సంపేట : దేవుడే స్వయంగా రమ్మని పిలుస్తున్నాడంటూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక అంగడి సెంటర్ దగ్గరలోని ఇందిరానగర్ లో పల్లకొండ, అభిరెడ్డి, రత్తమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో పెద్దదైన రమాదేవి (28) కి పదేండ్ల కిందట వివాహం జరిగింది. కొన్ని ఏండ్ల తర్వాత మనస్పర్థల కారణంగా వీరికి విడాకులయ్యాయి.

అనంతరం రమాదేవి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. మళ్లీ పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు కొన్ని నెలలుగా అంటున్నారు. దీనికి తోడు క్రిస్టియన్ లో చేరిన రమాదేవి దేవుణ్ణి అమితంగా ఆరాధించేది. ఎంతలా అంటే దేవుడే నన్ను రమ్మంటున్నాడు నేను వెళ్ళాలి అంటూ తనకు తానే మాట్లాడుకునేది. ఈ మధ్యే ఓసారి చెయ్యి మణికట్టు దగ్గర సైతం కత్తితో గాయ పరుచుకుంది. శుక్రవారం సాయంత్రం రమాదేవి తన చెల్లి ఫోన్ కి ‘దేవుడు రమ్మంటున్నాడు వెళ్తున్న’ అని మెసేజ్ పెట్టి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సీసీ ఫుటేజీ ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు శనివారం ఉదయం బావిలో నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story