ఆంటీతో యువకుడి ప్రేమాయణం.. నీలగిరి తోటలోకి వెళ్లి.. చివరికి

by  |
ఆంటీతో యువకుడి ప్రేమాయణం.. నీలగిరి తోటలోకి వెళ్లి.. చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎవరితో మొదలవుతుందో తెలియదు. అలాగే ప్రేమకు వయసు లేదంటారు. అందుకేనేమో ఓ ఆంటీతో ప్రేమలో పడ్డాడు 22 ఏళ్ల యువకుడు. 32 ఏళ్ల వివాహిత దేవి, 22 ఏళ్ల యువకుడు వెంకట్ ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా వీరు షాకిచ్చారు. దేవి, వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన వీరు గత కొంత కాలం నుంచి ప్రేమాయణం సాగిస్తున్నారు. అయితే ఉన్నట్టుడి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి నీలగిరి తోటలో పురుగుల మందు తాగి పడి ఉండటంతో అటు వైపు వెళ్లిన‌ స్థానికులు వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.



Next Story

Most Viewed