- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. యువతిపై పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. పూసపాటిరేగ మండలం చౌడువాడలో ఈ దారుణ ఘటన సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. చౌడవాడకు చెందిన యువతితో నరవకు చెందిన రాంబాబుకు వివాహం నిశ్చమైంది. మరికొద్దిరోజుల్లో వీరికి వివాహం జరపడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే యువతి మరొక యువకుడితో చనువుగాఉంటుందని అనుమానించి కాబోయే భర్త రాంబాబు ఈ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవ పోలీసుల వద్దకు వెళ్లింది. గురువారం రాత్రి పోలీసులు రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదిర్చారు.
పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు రాంబాబు అంగీకరించాడు. అంతా చక్కబడిందని యువతి, ఆమె కుటుంబ సభ్యులు ప్రశాంతంగా పడుకున్నారు. అయితే ఈ క్రమంలోనే రాంబాబు అర్ధరాత్రి యువతి ఇంట్లోకి దూరి నిద్రిస్తున్న ఆమెపై పెట్రోలుపోసి నిప్పంటించిచాడు. ఆ యువకుడిని బాధితురాలి సోదరి అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను పక్కకి నెట్టి పరారయ్యాడు. దీంతో యువతి సోదరికి, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పి ముగ్గురిని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుకృవరం యువతి బంధువుల ఫిర్యాదుమేరకు నిందితుడు రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.