డ్రైనేజీలో మూడు కి.మీ ప్రయాణం.. రెండు రోజుల తర్వాత..

by  |
Dead Body
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో శనివారం రాత్రి 9 గంటలకు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో రజనీకాంత్ అనే యువకుడు పడి గల్లంతైన విషయం తెలిసిందే. ఆ యువకుడి కోసం ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సోమవారం నెక్నాంపూర్ చెరువులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. చెరువులో జేసీబీ సాయంతో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టగా…. రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. అయితే, యువకుడు పడిన గుంత నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజీ నీరు కలిసే ప్రాంతంలో మృతదేహం లభ్యమైనట్లు డీఆర్ఎఫ్ సభ్యులు వెల్లడించారు.


Next Story

Most Viewed