పాస్ బుక్ కోసం యువరైతు ఏం చేశాడంటే ? (వీడియో)

by  |
పాస్ బుక్ కోసం యువరైతు ఏం చేశాడంటే ? (వీడియో)
X

దిశ, అసిఫాబాద్: సాగుచేస్తున్న భూమికి పట్టా పాస్ బుక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువ రైతు సెల్ టవర్ ఎక్కిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. అధికారులు తన భూమికి పట్టా పాసు పుస్తకం ఇవ్వటం లేదని ఆగ్రహానికి లోనైన ఓ యువరైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన భూమికి పట్టా పాసు పుస్తకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. పాసుపుస్తకం ఇచ్చేంత వరకు టవర్ దిగనని చెప్పడంతో అక్కడికి చేరుకున్న సంబంధిత అధికారులు, పై అధికారులతో మాట్లాడి పాస్ పుస్తకం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆ యువ రైతు టవర్ దిగాడు.

Next Story

Most Viewed