ఈతకు వెళ్లి యువకుడు మృతి

by Batti.Sumithra |

<p>దిశ,హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శనివారం ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం&#8230; మేళ్లచెరువు గ్రామంలో ఓ వివాహానికి హజరైన పల్ల గణేష్(27), సాయంత్రం తన స్నేహితులతో కలిసి చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారమందించి గాలింపు చేపట్టగా గణేష్ మృతదేహం లభ్యమైంది. వివాహానికి వధువు తరుపున వచ్చిన గణేష్ ఇలా మృతి చెందడంతో బంధువులు విలపించారు. ఈ [&hellip;]</p>

ఈతకు వెళ్లి యువకుడు మృతి
X

దిశ,హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో శనివారం ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మేళ్లచెరువు గ్రామంలో ఓ వివాహానికి హజరైన పల్ల గణేష్(27), సాయంత్రం తన స్నేహితులతో కలిసి చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారమందించి గాలింపు చేపట్టగా గణేష్ మృతదేహం లభ్యమైంది. వివాహానికి వధువు తరుపున వచ్చిన గణేష్ ఇలా మృతి చెందడంతో బంధువులు విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

Next Story