షాకింగ్.. నడిరోడ్డుపై యువకుడిని కర్రలతో కొట్టి..

by  |
షాకింగ్.. నడిరోడ్డుపై యువకుడిని కర్రలతో కొట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై కొందరు యువకులు మరో యువకుడిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గోవింద్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మే 28న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఉజ్జయినీ జిల్లాలో నీలంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లవకుశ్‌ నగర్‌లో గోవింద్‌ అనే యువకుడిపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed