కృష్ణా నదిలో… యువకుడు గల్లంతు

by  |
కృష్ణా నదిలో… యువకుడు గల్లంతు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నదిలో పడి యువకుడు కొట్టుకపోయిన సంఘటన జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మహబూబ్‌నగర్‌కు చెందిన కృష్ణ ఇంటింటికీ వాటర్ క్యాన్‌లు సప్లై చేస్తూ‌ జీవనం‌ కొనసాగిస్తున్నాడు.

ఆదివారం కావడంతో తన స్నేహితులతో‌ కలిసి‌ జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చాడు. సరదాగ నదిలో దిగి ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తు నది వరద ప్రవాహానికి కొట్టుకపోయాడు. అక్కడే ఉండి గమనించిన స్థానికులు చాల మంది కేకలు వేశారు. కృష్ణ ఒడ్డుకు చేరాడా? కొట్టుకపోయాడా అనే సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed