విషాదం.. టీఆర్ఎస్ ధర్నా ఫ్లెక్సీలు కడుతూ యువకుడు మృతి

by  |
Sunil-1
X

దిశ, కోదాడ: టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతిచెందిన ఘటన కోదాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు సంబంధించి కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద ఫ్లెక్సీలు కడుతూ బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ అనే యువకుడు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతనితోపాటు అక్కడే ఉన్న కుడుముల వెంకటేష్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed