భారీ వర్షాల ఎఫెక్ట్.. యువరైతు ఆత్మహత్య..

by  |
భారీ వర్షాల ఎఫెక్ట్.. యువరైతు ఆత్మహత్య..
X

దిశ, ఖానాపూర్: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెంబి మండలంలోని హరిచంద్‌ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తులసిపేట్ గ్రామానికి చెందిన నాగుల నర్సయ్య (21) అనే యువరైతు, తనకున్న ఏడు ఎకరాలలో పత్తిపంట వేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాలుగు ఎకరాలలో పత్తిపంట మునిగిపోయింది. దీంతో పంట వేయడానికి తీసుకువచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ముత్యం తెలిపారు.

Next Story

Most Viewed