- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: బతుకుదెరువు కోసం ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చిన ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రాగువారిగూడెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబం ఒరిస్సా నుంచి ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చింది. గర్భిణిగా ఉన్న రీనాజ్ నాగ్ అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందజేశారు. అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో నొప్పులు తీవ్రతరం కావడంతో అంబులెన్స్ను పక్కకు ఆపి 108 వాహన సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. అనంతరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Next Story