కి‘లేడీ’ మోసం.. 9 లక్షల స్వాహా

by  |
కి‘లేడీ’ మోసం.. 9 లక్షల స్వాహా
X

దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసానికి పాల్పడింది ఓ అటెండర్. సుమారు రూ.9 లక్షలు వసూలు చేసి చివరికి ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే నరసరావుపేట సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో శివపార్వతి అనే మహిళ అటెండర్‌గా పని చేస్తుంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ముగ్గురి వద్ద సుమారు రూ.9 లక్షలు తీసుకుంది. రోజులు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శివపార్వతిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed