అనుమానాస్పద స్థితిలో అనాథ మహిళ.. చేరదీసిన డాక్టర్

by  |
అనుమానాస్పద స్థితిలో అనాథ మహిళ.. చేరదీసిన డాక్టర్
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న అనాథ మహిళను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి చేరదీశారు. శుక్రవారం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనాథగా తిరిగుతున్న మహిళ విషయం తెలుసుకున్న నాగవాణి వెంటనే సఖీ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల పట్ల బాధ్యత యుతంగా ఉండాలని తెలిపారు. మానవ అక్రమ రవాణా‌పై పోలీసులకు, చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో స్వరూప,శోభ,లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

Next Story