మహిళ మెడపై కత్తి పెట్టి ఆ పని చేసిన దుండగుడు

by  |
woman died
X

దిశ, ఉత్తరాంధ్ర : విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దుండగుడు దాడికి పాల్పడి ఆమెపై బంగారాన్ని దోచుకెళ్లాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దత్తిరాజేరు మండలం ముద్దానపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ముద్దానపేట ఎంపీపీ స్కూల్‌లో మిడ్డే మీల్స్‌లో వంట చేస్తున్న చిన్నమ్మ గ్రామం నుంచి మానాపురం వైపు నడుచుకుంటూ వెళ్తుంది. మార్గమధ్యలో గుర్తు తెలియని దుండగుడు ఆమెను అడ్డగించి మెడపై కత్తి పెట్టాడు. ఆమె అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో చిన్నమ్మ గొంతుకు తీవ్రగాయాలు అయ్యాయి. అయినా దుండగుడు ఆమె మెడలోని గొలుసు లాక్కోని పరారీ అయ్యాడు. స్థానికులు అప్రమత్తమై చిన్నమ్మను గజపతినగరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మానాపురం పోలీసులు తెలిపారు.


Next Story