తల నొప్పి అని వెళ్లిన మహిళను బాబా ఏం చేశాడంటే..?

by  |
mother killed daughter
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో దొంగ స్వాముల సంఖ్య బాగానే పెరుగుతోంది. మన నమ్మకమే వారి పెట్టుబడిగా మారిపోయింది. టెక్నాలజీ ఇంతగా అభివృద్ది జరిగినా ఇంకా మంత్రాలు తంత్రాలనే నమ్ముతున్నారు. తాయత్తులు, స్వాములు అంటూ ఇంకా తిరుగుతున్నారు. కొన్ని సార్లు మన నమ్మకం వల్ల మంచి జరిగితే , కొన్ని సార్లు నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి ఘటనే తాజాగా కర్నాటక లో జరిగింది. పార్వతి అనే 38 ఏళ్ల మహిళ చాలా కాలంగా తల నొప్పితో బాధ పడుతూ ఉంది. చాలా మంది డాక్టర్లకు చూపించి విసిగి పోయింది. ఎన్ని టెస్ట్ లు చేసినా అసలు సమస్య ఏంటో పూర్తిగా చెప్పలేక పోయారు. ఎలాగోలా ఇంత కాలం ట్యాబ్లెట్లతో నెట్టుకు వచ్చింది. ఈమె అవస్థలు చూడలేని దూరపు బంధువు ఒకాయన బెక్క అనే గ్రామంలో మను బాబా అనే స్వామీజీ ఉన్నాడు అక్కడికి వెళితే బాగవుతుందని సలహా ఇచ్చాడు. ఎంతో ఆశగా వెళ్లిన ఆమెకు తల నొప్పి తగ్గిస్తానని బాబా హామీ ఇచ్చాడు. అతడు ఎంతగా బాధ పెట్టినా ఓర్చుకుంది.

ఆయన చిత్రవిచిత్ర దండకాలు ఏదో చదువుతూ తన దగ్గర ఉన్న దండం తీసుకుని గట్టిగా ఆమె తలపై కొట్టాడు. అంతే ఇంకేముంది తలపై నుంచి రక్తం ఆగకుండా కారే సరికి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ పార్వతి అక్కడే కన్ను మూసింది. మను బాబా పోలీసులకు దొరక్కుండా పరారీ అయ్యాడు. పార్వతి కుమార్తె చైత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

Next Story

Most Viewed