సభలో రచ్చ రచ్చ.. TRS నేత చెంప చెళ్లుమనిపించిన మహిళా కౌన్సిలర్ (వీడియో)

by  |
సభలో రచ్చ రచ్చ.. TRS నేత చెంప చెళ్లుమనిపించిన మహిళా కౌన్సిలర్ (వీడియో)
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి చెంప చెళ్లుమనిపించింది మహిళా కౌన్సిలర్. వివరాల ప్రకారం.. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఆయా వార్డులకు సంబంధించి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. వార్డులో స్థానిక నేతలతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవ్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ జయశ్రీ, అధికార పార్టీ యువ నాయకుడు, జములమ్మ దేవాలయ కమిటీ డైరెక్టర్ రాము హాజరయ్యారు. రాజకీయ విభేదాలు ఉన్నకారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అర్హత ఎక్కడిది? అతను ఉంటే నేను సభలో పాల్గొనను అని కౌన్సిలర్ జయ శ్రీ పక్కకు తప్పుకుంది. ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేసి వెళ్లి పోయిన వెంటనే అధికార పార్టీ యువ నాయకుని పై మహిళా కౌన్సిలర్ తిట్లదండకం అందుకుంది. మాట మాట పెరగడంతో యువ నాయకుని చెంప చెళ్లుమనిపించింది. ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటనకు అక్కడ ఉన్న వారంతా బిత్తరపోయారు. దీనితో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా ఒకే వార్డు‌కు చెందిన ఇరువురు రాజకీయ ప్రత్యర్థులు కావడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. బాధితుడు రాము పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.



Next Story

Most Viewed