భార్య తనపై క్షుద్రపూజలు చేస్తొందని ఆ పని చేసిన భర్త…

by  |
భార్య తనపై క్షుద్రపూజలు చేస్తొందని ఆ పని చేసిన భర్త…
X

దిశ, చెన్నూర్ : కట్టుకున్న భార్య తనపై క్షుద్రపూజలు చేస్తొందని అనుమానం కలిగిన వ్యక్తి తన భార్యను హతమార్చిన ఘటన నర్సింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… నర్సింగాపూర్ గ్రామానికి చెంది కేతం లింగయ్య, లక్ష్మి దంపతులు. అయితే కొద్ది రోజుల నుండి లక్ష్మి తనపై క్షుద్రపూజలు చేస్తొందని అనుమానం వచ్చిన లింగయ్య తరుచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో అదును చూసి భర్త లింగయ్య గొడ్డలితో భార్య లక్ష్మిని నరికి హత్య చేశాడు.

ఈవిషయంపై లక్ష్మి పెద్ద కొడుకు వేణుగోపాల్ సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గంగరాజు కేసు నమోదు చేయగా, సీఐ టి.సంజీవ్ విచారణ చేపట్టారు. ఈ విషయమై ఏసీపీ నరేందర్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన తరువాత పరారీలో ఉన్న లింగయ్య మరుసటిరోజు జైపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలసిన సీఐ సంజీవ్ నిందితుడు లింగయ్య వద్ద నుండి సెల్‌ఫోన్, రక్తం మరకలు గల షర్ట్, లుంగీ తో పాటు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed