ఆస్తిపత్రాలు ఇస్తావా.. ముఖం మీద దగ్గమంటావా

by  |
ఆస్తిపత్రాలు ఇస్తావా.. ముఖం మీద దగ్గమంటావా
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. అయితే దానినే అలుసుగా తీసుకోని ఓ మహిళ తన మాజీ భర్తను బెదిరించిన ఘటన హైదరాబాద్ జూబ్లీహీల్స్‌లో చోటు చేసుకుంది. కరోనాతో బెదిరిచడం ఏంటీ అనుకుంటున్నారా.. నాకసలే కరోనా సోకింది మర్యాదగా ఆస్తి పత్రాలు ఇవ్వు లేకుంటే ముఖంపై దగ్గుతానంటూ తన మాజీ భర్త బెదిరించింది. వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో నివసించే వ్యాపారవేత్త సంజీవరెడ్డి (70) గతంలో ఓ మహిళ (38)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

ఈ క్రమంలో మహిళ పేరిట ప్రశాసన్‌నగర్‌లో సంజీవరెడ్డి ఇంటిని కొనుగోలు చేశాడు. అనతరం ఆమె మరకొరిని వివాహం చేసుకుంది. దీంతో ఆతండ్రికొడుకులిద్దరూ నందనగిరిహిల్స్‌లో జీవనం సాగిస్తున్నారు. అయితే తన పేరిట కొనుగోలు చేసిన ఇంటి పత్రాలను తనకివ్వాలంటూ సంజీవరెడ్డిని తన మాజీ భార్య దుర్భాషలాడింది. నాకసలే కరోనా పాజిటివ్ ఉంది, ఇంటి పత్రాలు ఇస్తావా ముఖం మీద దగ్గమంటావా అని బెదిరించింది. దీంతో సంజీవరెడ్డి తన మాజీ భార్య ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తనను బెదిరించిదని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed