భార్యను కిరాతకంగా నరికి చంపిన భర్త..

by  |
murder
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ కసాయి భర్త భార్యను దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున నీలా గ్రామానికి మందిన పిల్లోలా మనుభాయి(40), ఆమె భర్త దావుజీ మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త భార్యను మటన్ కత్తితో కిరాతకంగా నరికి చంపాడు. దీంతో భార్య అక్కడికక్కడే మరణించింది. భార్యను హత్య దావూజీ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దావూజీకి ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో మృతురాలు(పిల్లోల మనుభాయ్) మొదటి భార్య. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed