నగరంలో మరో నిత్యానంద!

by  |
నగరంలో మరో నిత్యానంద!
X

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో మరో నిత్యానంద లీలలు నడిపిస్తూ.. భక్తి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఓ స్వామిజీపై సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. తనను పెళ్లి చేసుకుని మానసిక క్షోభకు, వేధింపులకు గురి చేస్తున్నాడంటూ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త డాక్టర్ ప్రదీప్ జోషిపై స్వామిజీ వేషంలో మహిళలను లొంగదీసుకుంటున్నట్టు ఫిర్యాదులో వెల్లడించింది.

బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండలో ఆశ్రమం నిర్వహించే డాక్టర్ ప్రదీప్ జోషి తన కంటే ముందుగానే రెండు వివాహాలు చేసుకున్నాడని వాపోయింది. కానీ, తనకు మాత్రం మొదటి వివాహం విడాకులు అయినట్టుగా చెప్పి పెండ్లి చేసుకున్నాడని తెలిపింది. ఆధ్యాత్మిక గురువు కావడంతో నమ్మి తనను 2019 మార్చి 8వ తేదీన తిరుమల తిరుపతి అహోబిల మఠంలో వివాహాం చేసుకున్నట్టు తెలిపింది.

వివాహాం అయిన దగ్గర్నుంచి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గోడు వెల్లబోసుకుంది. వివాహాం సమయంలో గోల్డ్ చైన్, డైమండ్ రింగ్, వెండి ప్లేట్, వెండి పూజా సామాగ్రితో పాటు బంగారం ఆభరణాలు తదితర రూ.15 లక్షల విలువ చేసే వస్తువులు ఇచ్చినట్టుగా వాపోయింది. అయినా, ప్రదీప్ జోషికి అనేక మంది మహిళలతో వివాహేత సంబంధాలు ఉన్నాయని.. అంతే కాకుండా, నిత్యం నిత్యానంద స్వామీజీ వీడియోలను చూసేవాడని, నిత్యానంద స్వామిజీ లాగా ప్రత్యేక సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని తన ధ్యేయంగా చెప్పుకునేవాడని పేర్కొంది.

హైదరాబాద్‌తో పాటు బెంగుళూరులోనూ ఇతనికి ప్రత్యేక శిబిరం నిర్వహిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున్నట్టు తెలిపింది. తనను వేధించే సమయంలో అవసరమైతే కోర్టుకు వెళ్తావా, లేదంటే మీడియా, పోలీసుల వద్దకు వెళ్ళినా.. ఏ సమయంలో నాపై 498 (ఏ) కేసు ఫిర్యాదు చేసినా ఐ డోంట్ కేర్ అంటూ బెదిరించినట్టుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఉమెన్ పీఎస్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed