‘ఇప్పటికే ఐదుగురు చనిపోయారు.. గ్రామస్తుల ధర్నా’

by  |
‘ఇప్పటికే ఐదుగురు చనిపోయారు.. గ్రామస్తుల ధర్నా’
X

దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో 365ఏ జాతీయ రహదారిపై రెండు అండర్ పాస్ నిర్మాణాలను చేపట్టాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున రహదారిపై మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. జాజిరెడ్డిగూడెం గ్రామం వద్ద అండర్ నిర్మాణం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి.. ఇప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని, పది మూగజీవాలు మృతిచెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే చొరవ తీసుకొని అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉషారాణి, ఎంపీటీసీ నాగమ్మ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed