- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు భక్తులకు దర్శనం, కోడె మొక్కులతో పాటు అన్ని పూజలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించడం సాధ్యం కాలేదంటూ దేవాదాయ శాఖ పేర్కొంది. అదే విధంగా ఈ నెల 21న శ్రీరామ నవమి ఉత్సవాలు, భకోత్సవ కళ్యాణం, రథోత్సవం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో 18 నుంచి 22 వరకు భక్తులకు అనుమతి లేదని, ఆన్లైన్ ద్వారా పూజలు సమర్పించుకునే సదుపాయం ఉంటుందని దేవాదాయ శాఖ పేర్కొంది.
Next Story