ఏ సాయం కావాలన్నా చేస్తాం : కిషన్ రెడ్డి

by  |
ఏ సాయం కావాలన్నా చేస్తాం : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఈ వ్యాధికి సంబంధించి, కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అంతేగాకుండా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఒకరు చనిపోగా, రోజురోజుకూ వ్యాధి బారినపడి అనేకమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు.


Next Story