గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనం

by  |
గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనం
X

దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఇంటి ముందు రేకుల షెడ్డులో గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనమయ్యాడు. వివరాల ప్రకారం.. బిల్డర్ ఇక్బాల్ గాంధీ నగర్ కాలనీలో నూతన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఇంటి ముందు రేకుల షెడ్డులో వాచ్ మెన్ ఉంటాడు. అయితే నిన్న ఉదయం బంధువులు అయ్యప్ప మాల వేసుకుంటున్నారని వాచ్ మెన్ ఇంటికి వెళ్ళాడు. నేడు ఉదయం వచ్చి చూడగా రేకుల షెడ్డు కాలిపోవడంతో పాటు అందులో ఓ వ్యక్తి సజీవదహనం అయినట్టు గుర్తించిన వాచ్ మెన్ బిల్డర్‌కు సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు తెలిపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టుగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మృతి చెందిన వ్యక్తి సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే విద్యుత్ షాక్‌తో ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి తగులబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed