- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కాటారం: ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ చేపట్టిన చావు డప్పు మోగింది. సోమవారం కాటారం మండల కేంద్రంలోని ఎర్రబెల్లి అంబేద్కర్ కూడలిలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్, టీఆర్ఎస్ యువజన నాయకుడు జక్కు రాకేష్, మండల శాఖ అధ్యక్షుడు తోట జనార్ధన్ ల నేతృత్వంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల తోనే వరి ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని అన్నారు.
వానాకాలం ధాన్యం కొనుగోలు పై అయోమయం సృష్టిస్తూ యాసంగి బియ్యం కొనమని గందరగోళం సృష్టిస్తున్న కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల తీరుకు నిరసనగా మంథని నియోజకవర్గంలో గ్రామగ్రామాన చావు డప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ యువజన నాయకుడు జక్కు రాకేష్ , కాటారం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు తోట జనార్ధన్, గారేపల్లి సింగిల్విండో చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరావు, కొడుదుల రాజబాబు, ఎలుబాకా సుజాత, శ్రీ లక్ష్మి, జోడు శ్రీనివాస్ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.