అమీన్పూర్‌లో విషాదం

by  |
అమీన్పూర్‌లో విషాదం
X

దిశ,మెదక్: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కులోని క్వారీ గుంతలో పడి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. బొల్లారం గాంధీనగర్ కాలనీలో ఉండే జుంజురి రాజు అనే యువకుడు ఇద్దరు స్నేహితులతో కలిసి మెడికల్ డివైజ్ పార్కులో ఉన్న క్వారీగుంత వద్దకు ఈతకు వెళ్లారు. వీరు వెళ్లిన కొద్ది సేపటి తర్వాత బొల్లారానికి చెందిన మరో ఏడుగురు యువకులు క్వారీ వద్దకు వచ్చారు. వారికి ఈత రాకపోవడంతో నీటి అంచు బంతితో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో నీటిలోకి బంతి వెళ్లింది. రాజు మరో స్నేహితుడితో కలిసి బంతిని తీసుకురావడానికి నీటిలోకి వెళ్లారు. బంతిని తీసుకొని వస్తుండగా రాజు మధ్యలోనే ఊపిరాడక నీటిలోమునిగిపోయాడు.

Next Story