ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం

by  |
tractor overturned
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మందర్నా గ్రామంలో దారుణ ఘోర ప్రమాదం జరిగింది. మందర్నా గ్రామ శివారులో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు విషయం తెలిపారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు బోధన్ రూరల్ ఎస్సై లోకం సందీప్ వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed